BREAKING NEWS

2/10/15

Delhi Assembly Elections 2015 Results

Delhi Assembly Elections 2015 Results
2015 Delhi Assembly Elections లో భారత ప్రజాస్వామ్య చరిత్రలో 'ఆం ఆద్మీ పార్టీ' చారిత్రక విజయం సాధించింది.  ఫిబ్రవరి 7, 2015 ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 70 శాసనసభ స్థానాలకు గాను 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) 67 శాసనసభ స్థానాల్లో ఊహించని ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 3 శాసనసభ స్థానాలకు పరిమితమైంది.  గత 15 సంవత్సరాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.  2013 డిశంబర్ లో జరిగిన Delhi Assembly Elections లో ఆప్ - 28 అసెంబ్లీ స్థానాలు, బి.జె.పి. 31 స్థానాలు, కంగ్రెస్ - 8 స్థానాలు, ఇతరులు - 3 స్థానాలు గెలుచుకోగా, ఈ సారి 2015 Delhi Assembly Elections లో ఫిబ్రవరి 10 న వెలువడిన Results ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీ శాసనసభ మొత్తం స్థానాలు: 70

AAP విజయం సాధించిన స్థానాలు: 67
BJP విజయం సాధించిన స్థానాలు: 03
Congress విజయం సాధించిన స్థానాలు: 00
Others విజయం సాధించిన స్థానాలు: 00



ఈ ఫలితాల పట్ల AAP కన్వీనర్ Arvind Kejriwal హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సామాన్యుడి విజయం అని పేర్కొన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సామాజిక వేత్త అన్నా హజారే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు.  ఫిబ్రవరి 14, 2015 న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Post a Comment