ఢిల్లీ ఎన్నికల్లో 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) ఘన విజయం.
దేశవ్యాప్తంగా బి.జె.పి. శ్రేణుల్లో అంతర్మధనం
ఢిల్లీలో ఓటమిని ఒప్పుకొన్న బి.జె.పి..
'ఆప్' కు కలిసొచ్చిన బి.జె.పి. వ్యతిరేక ఓటు.
మినీ ఇండియాగా భావించే ఢిల్లీ శాసనసభ 2015 ఎన్నికల్లో సత్తా చూపిన సామాన్యుడు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) ఘన విజయం సాధించింది.
70 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ప్రధానంగా AAP మరియు BJP పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి AAP ఘన విజయం సాధించడం 'దేశ రాజకీయాలలో విప్లవం మొదలైంది' అని ట్విటర్ లో కేజ్రీవాల్ అన్నారు.
ఆదర్శవంతమైన ఎన్నికలు అని, BJP వ్యతిరేకులకు AAP ఆశాజ్యోతిగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీ రాష్త్ర మొత్తం శాసనసభ స్థానాలు: 70
AAP ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 65
BJP ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 04
Congress ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 00
Others ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 01
Arvind Kejriwal కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హక్కుల కోసం కేజ్రీవాల్ పోరాడతారని ఢిల్లీ ప్రజలు భావించారని ప్రముఖ సామాజికవేత్త 'అన్నా హజారే' అభిప్రాయ పడ్డారు. ఒక common man ఇంత ఘనవిజయం సాధించండం చాలా గొప్ప విషయం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇంకా ఈ ఓట్ల లెక్కింపులో అంతిమ ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Post a Comment